APSRTC బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించనుంది. సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం ద్వారా 74 శాతం APSRTC బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇంటర్స్టేట్, ఘాట్ రోడ్లు, నాన్స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డ్రైవర్లు, కండక్టర్ల కొరతను అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నారు.