రాఖీ

రాఖీ పండుగపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘రాజకీయం వేరు.. రక్తసంబంధం వేరు’

Posted on: 06-08-2025

Categories: Politics | Telangana

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఈసారి కవిత, కేటీఆర్‌లు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి నెలకొంది. గత ఏడాది కవిత జైలులో ఉండటం వలన రాఖీ కట్టలేకపోయారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, రక్త సంబంధం వేరని, తప్పకుండా ఈ సంవత్సరం తన అన్న కేటీఆర్‌కు రాఖీ కడతానని కవిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారి రాఖీ వేడుక ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది.

Sponsored