ఏపీలో

ఏపీలో కొత్త క్రికెట్ స్డేడియం.. ఆ జిల్లాలోనే.. ఆ గ్రౌండ్ రూపురేఖలు మారిపోతాయ్!

Posted on: 06-08-2025

Categories: Politics | Andhra

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా యువతకు గుడ్ న్యూస్.. ఉండి హైస్కూల్ గ్రౌండ్‌ను క్రికెట్ స్టేడియంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విషయాన్ని ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. దాతల సాయంతో సుమారు 80 లక్షలు ఖర్చు చేసి ఉండి హైస్కూలును అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులను ప్రారంభించిన రఘురామకృష్ణరాజు.. ఉండి హైస్కూల్ గ్రౌండ్‌ను జిల్లా క్రికెట్ స్టేడియంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియషన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని వెల్లడించారు.

Sponsored