ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పలువురు ఉద్యోగుల్ని తొలగించింది. మరికొందరికి నోటీసులు జారీ చేసింది. కొందరు ఉద్యోగులు హాజరు విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరికొందరు కూడా ఇలాగే చేశారని.. త్వరలో వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కొందరు ఉద్యోగులకు విధులకు వెళ్లకుండానే అటెండెన్స్ మేనేజ్ చేసినట్లు చెబుతున్నారు..