తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు రూ.700 కోట్లు విడుదల చేయగా.. ఆగస్టు 4న ఒక్కరోజే రూ.130 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సోమవారం డబ్బులు బదిలీ చేస్తున్నారు. ఈ పథకం కోసం హడ్కో నుంచి రూ.500 కోట్ల లోన్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం లక్షన్నరకు పైగా ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.