టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని, నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలనే మోసం చేశారని ఆరోపిస్తూ ప్రతిపక్ష వైసీపీ జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా `వెన్నుపోటు దినం` నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ అధిష్టానం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రస్థాయిలో నిర్వాహణ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించింది. వెన్నుపోటు దినం కార్యక్రమంలో నేతలంతా పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు.