ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఓవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేస్తూ కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే నేడు రాజమండ్రిలో `అఖండ గోదావరి` పర్యాటక ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారు.