ఏపీ సీఎం చంద్రబాబు తరచుగా వినియోగించే హెలికాప్టర్లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో హెలికాప్టర్ను తిరుపతిలోనే వదిలేశారు. అయితే.. ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లోనూ.. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. తరచుగా ఎందుకు మొరాయిస్తోంది? అసలు ఏం జరిగింది? దీనిని భవిష్యత్తులో వినియోగించాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం సంబంధిత సంస్థను సమాచారం కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరణ కోరుతూ హెలికాప్టర్ సంస్థ జీఎంఆర్కు లేఖ రాశారు.