నిప్పుకు చెద పట్టినట్టుగా.. న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో వెలుగు చూసిన నోట్ల కట్టలు.. వాటి కి నిప్పు అంటుకున్న వ్యవహారం.. దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పదవి నుంచి దింపేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు, లేదా సుప్రీంకోర్టున్యాయమూర్తులపై అభియోగాలు వచ్చినప్పుడు.. వారంతట వారు తప్పుకొంటారన్నది న్యాయ సూత్రం.