రాజకీయాల్లో ఉన్నవారు.. ఏం మాట్లాడినా చెల్లుతుందనే రోజులు పోయాయి. ప్రజలు కూడా ఏం చెప్పినా వినేస్తారని.. ఏం చేసినా.. నమ్మేస్తారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఎవరినీ దాచి పెట్టదు. గత, ప్రస్తుత విషయాలను జోడించి నాయకుల బండారాలను బయట పెట్టేస్తోంది. దీంతో మనం ఏం చేసినా ప్రజలు విశ్వసిస్తారు.. అదే నిజమని నమ్మేస్తారని అనుకుంటే భ్రమే. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.